Asman Gar Palas Hydarabad


అస్మాన్ గర్ పాలస్, హైదరాబాద్

'ఆకాశం యొక్క ఇల్లు' అనే అర్ధం వచ్చేటట్టు పేరు ఉన్న ఆస్మాన్ గర్ పాలస్ హైదరాబాద్ లో ని ఒక చిన్న కొండ మీద నిర్మితమై ఉంది. ప్రస్తుతం, పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఈ పాలసు మారింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ఈ పాలసు ప్రాంగణం లో ఉంది. 1885 లో హైదరాబాద్ యొక్క అప్పటి ప్రధాన మంత్రి అయిన ఆస్మాన్ జా చేత రూపొందించి నిర్మించబడింది.
ప్రధాన మంత్రి కి చెందిన పైగర్హ్ కుటుంబీకుల కోసం ఈ పాలసు ప్రత్యేకించి రూపొందించబడినది. అతనికి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో తన కలల సౌధం ఉండాలని కోరిక. అందువల్ల, కొండ పైన ఈ సౌధం నిర్మాణాన్ని చేపట్టారు. ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన నిర్మాణ శైలిలో ఈ భవన నిర్మాణం జరిగింది. అప్పుడు ప్రాచుర్యం పొందిన నిర్మాణ శైలి గోతిక్. గోతిక్ శైలిలోనే ఈ ఆస్మాన్ గర్ పాలసు యొక్క నిర్మాణం ఉంది. మధ్యయుగపు యురోపెయన్ కోట ఆకృతిలో ఈ భవన నిర్మాణం జరిగింది.


Comments